నంద్యాల, జనవరి 06, 2026:
( ఎల్లో సింగంప్రతినిధి )
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం మరియు ప్రాణవాయువు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు పేర్కొన్నారు. మంగళవారం నాడు నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పార్టీని కాపాడుకున్న కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నంద్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి, సమస్యల పరిష్కారానికి తక్షణమే కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
