క్వాంటం ప్రోగ్రామ్ లో వివిధ అంశాలను ప్రజెంటేషన్ ద్వారా విద్యార్ధులకు వివరించిన సీఎం చంద్రబాబు.
25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం.. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం.
ఆర్ధికంగా బంగారు పిచ్చుక అనే పేరు భారత్ కు ఉండేది.. 2 వేల ఏళ్ల క్రితమే ప్రపంచ జీడీపీలో 40 శాతం భారత్ నుంచే వచ్చేది.
ఇప్పుడు 4వ ఆతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఉంది.. వైద్యులు, ఇంజనీరింగ్, ఐటీ నిపుణులు ఇతర దేశాలకు వెళ్లి భారతీయుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.
మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, జీఎస్టీ లాంటి సంస్కరణలతో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతున్నాం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులే.. వారిలోనూ ఏపీ నుంచి వెళ్లిన వారే ఉన్నారు.
ప్రధాని మోదీ రూపొందించిన ‘వికసిత్ భారత్’ లక్ష్యంతో భారత్ 30 ట్రిలియన్ డాలర్ ఆర్ధిక
