ఢిల్లీ నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్ రూపకల్పనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల నుంచి సూచనలు, ప్రతిపాదనలు స్వీకరించనున్నారు. ఈ ‘ప్రీ–బడ్జెట్’ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక అవసరాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు, కేంద్ర పథకాల అమలు, ఆర్థిక సవాళ్లపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమతుల్యమైన బడ్జెట్ రూపొందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ భేటీ నిర్వహిస్తోంది.
WhatsApp
Join Now
Youtube
Subscribe
