ఏపీలో దోమలపై హైటెక్ యుద్ధం – AI ఆధారిత స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ ప్రారంభం

ప్రజారోగ్యానికి సవాల్‌గా మారిన దోమల నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త, ఆధునిక నిర్ణయం తీసుకుంది. AI ఆధారిత స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ ను ప్రారంభిస్తూ, మొదటి దశలో తిరుపతి పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో 250 హాట్‌స్పాట్లను గుర్తించి, 4 ప్రాంతాల్లో IoT సెన్సార్లు, జాప్ ట్రాపులు ఏర్పాటు చేయడం జరుగుతోంది. మొత్తం వ్యయం ₹20 లక్షలగా ఉంది.

AI ఆధారిత డ్యాష్‌బోర్డ్ ద్వారా రియల్-టైమ్ విశ్లేషణ చేయబడతాయి. అవసరమైతే డ్రోన్ల సాయంతో లక్ష్యిత మందుల పిచికారీ చేయబడుతుంది. ఫలితాల ఆధారంగా ఈ సాంకేతికతను విశాఖ, విజయవాడ, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి వంటి నగరాలకు విస్తరించనున్నారు.

డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంలో ఇది కీలక అడుగు కావచ్చు. AI ఆధారిత పద్ధతులు దోమల సంభ్రమాన్ని తగ్గిస్తూ, ప్రజల ఆరోగ్య రక్షణలో మరింత సమర్థతను తీసుకురావడం గమనార్హం.

WhatsApp Join Now
Youtube Subscribe