సీఎం చంద్రబాబు తో అమరావతి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం సందర్శించిన బిల్ గేట్స్ – పాలనలో డిజిటల్ మార్గదర్శకాన్ని పరిశీలించిన గ్లోబల్ టెక్ లీడర్

అమెరికా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు తో కలిసి అమరావతి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో బిల్ గేట్స్ ఆర్టీజీఎస్ ద్వారా పౌర సేవలను వేగంగా అందిస్తున్న విధానాలను, డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి ఆధునిక డిజిటల్ సాంకేతికతల వినియోగాన్ని పరిశీలించారు. సీఎం వివరించిన విధంగా, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలను డేటా లేక్ ద్వారా అనుసంధానించి, రియల్ టైమ్ లో సమాచార సేకరణ ద్వారా వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బిల్ గేట్స్ సంజీవని ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డుల వినియోగం, కుప్పం లో అమలైన సీజీవని ప్రాజెక్టు వంటి విధానాలను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ పథకాల అమలు, పౌరుల సౌకర్యాలపై ప్రశంసలు తెలిపారు. అదనంగా, గ్రీన్ & బ్లూ ప్రణాళిక, బ్లాక్‌చైన్ ద్వారా భద్రతా చర్యలు, క్యూ ఆర్ కోడ్ పారదర్శకత, పన్ను వసూళ్ల వ్యవస్థను గమనించి, తెలంగాణ పాలనలో డిజిటల్ పద్ధతులను ‘గ్రేట్ వర్క్’ అని అభినందించారు. ఈ సందర్శన ద్వారా ఆర్టీజీఎస్, డిజిటల్ పాలనలో ఆంధ్రప్రదేశ్ సాంకేతికతపై అంతర్జాతీయ గుర్తింపును సాదించిందని విశ్లేషకులు పేర్కొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe