‘26-26’ ఉగ్ర కుట్రపై నిఘా వర్గాల హెచ్చరిక

గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని భారత్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఐఎస్‌ఐ సహకారంతో ‘26-26’ కోడ్‌ నేమ్‌తో దాడులకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో జమ్మూ కశ్మీర్‌, దిల్లీ, పంజాబ్‌ సహా కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానితులపై వాంటెడ్‌ నోటీసులు జారీ చేయగా, సోషల్‌ మీడియాలో ఉగ్ర భావజాలాన్ని ప్రచారం చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe