నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల మధ్య ముగిశాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితులు మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లకు పైగా పడిపోగా, తర్వాత కొంత కోలుకున్నా చివరికి నష్టాలతో ముగిసింది. నిఫ్టీ కూడా 25,100 దిగువకు చేరి ఒడిదుడుకులు ఎదుర్కొంది. చివరికి సెన్సెక్స్‌ 270.84 పాయింట్లు తగ్గి 81,909.63 వద్ద, నిఫ్టీ 75 పాయింట్ల నష్టంతో 25,157.50 వద్ద ముగిశాయి. రూపాయి డాలర్‌తో పోలిస్తే జీవితకాల కనిష్ఠం 91.73కు చేరింది. మార్కెట్లో కొన్ని బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోగా, రిలయన్స్‌, అదానీ పోర్ట్స్‌ వంటి షేర్లు లాభపడ్డాయి

WhatsApp Join Now
Youtube Subscribe