బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-
బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో గల రామ భద్రపురం ప్రభుత్వ ఆసుపత్రి సముదాయం లో నూతన ఆయుర్వేద ఆసుపత్రి భవన నిర్మాణానికి బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ఆదివారం శంకుస్థాపన చేశారు. నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా రూ.20 లక్షలు నిధులతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి చింతల రామకృష్ణ, విజయనగ రం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మడక తిరు పతిరావు,రామభద్రపురం మండలం టీడీపీ అధ్యక్షులు కరణం భాస్కరరావు, రామభద్ర పురం మండలం బీజేపీ అధ్యక్షురాలు మూడడ్ల ఆదిలక్ష్మి , రామభద్రపురం మండ లం జనసేన నాయకులు కనకల శ్యామ్, అల్లు రమేష్, పొందూరి సత్యనారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
