వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలి.

ఎస్సై దుగ్గిరెడ్డి,,

బనగానపల్లె, జనవరి, 17.
(ఎల్లో సింగం ప్రతినిధి )

బనగానపల్లె పట్టణంలో పాత బస్టాండ్ బ్రిడ్జి దగ్గర
వాహనాల నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై దుగ్గిరెడ్డి తెలిపారు. శనివారం బనగానపల్లె పట్టణంలో పాత బస్టాండ్ బ్రిడ్జి దగ్గర ఉన్న మూడు రోడ్ల కూడలిలో రోడ్డు భద్రతపై ప్రజలకు వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహన నడిపేవారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. అలాగే ఇన్సూరెన్స్, మైనర్లు వాహనాలు నడపడం, అతివేగం గా నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించడం, తదితరు అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించమన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe