రాష్ట్ర తెదేపా మహిళా కార్యదర్శి
ముప్పిడి సుజాత
మహిళా సాధికారతకు స్వర్గీయ నందమూరి తారకరామారావు ఎనలేని ప్రాధాన్యత కల్పించారని టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ముప్పిడి సుజాత సురేశ్ అన్నారు. లావేరు మండలం తాళ్ళవలసలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 30వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఆమె స్థానిక మహిళలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో వృద్ధులకు, దుస్తులు,పండ్లు పంపిణీ చేశారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
