దావోస్‌ పర్యటనలో తెలుగు రాష్ట్రాల సీఎంలు

దావోస్‌ పర్యటనలో తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్లను వేర్వేరుగా సీఎం చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ‘విజన్‌ 2047’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించడంతో పాటు ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌ను ప్రారంభించనున్నారు.

ఇదిలా ఉండగా, సీఎం చంద్రబాబు నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. సీఐఐ బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌కు హాజరవడంతో పాటు IBM, గూగుల్‌ క్లౌడ్‌ సీఈవోలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe