ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. పన్ను చెల్లింపుదారుల కోసం కేంద్రం కొత్త మార్గాలను పరిగణిస్తున్నది. ప్రధానంగా పాత ఇన్కమ్ ట్యాక్స్ రెజీమ్ను రద్దు చేసి, అందులో ఉన్న తగ్గింపులు, మినహాయింపులను కొత్త పన్ను విధానంలో సమీకరించేలా నిర్ణయం తీసే అవకాశముందని ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం పాత మరియు కొత్త పన్ను విధానాల మధ్య తేడాలు ఉన్నాయి. పాత విధానం ద్వారా సెక్షన్ 80సీ, 80డీ, 80టీటీఏ వంటి పెట్టుబడులు, హౌస్ లోన్ వడ్డీ, హెల్త్ ఇన్సూరెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్ వంటి రాయితీలు లభిస్తాయి. కొత్త విధానం తక్కువ పన్ను రేట్లను కలిగినా, మినహాయింపులు పరిమితం. కేంద్రం ఈ రెండింటిని ఏకీకృతం చేసి, కొత్త పన్ను విధానాన్ని ప్రభావవంతంగా మార్చే దిశగా ప్రయత్నిస్తున్నట్లు సూచనలు ఉన్నాయి.
