ఏపీ మద్యం కేసులో నిందితులకు సుప్రీంకోర్టు షాక్‌

ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డికి రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది. బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టును ఆశ్రయించాలని సీజేఐ ధర్మాసనం సూచిస్తూ నాలుగు వారాల గడువు ఇచ్చింది. నిందితులు ప్రస్తుతం డిఫాల్ట్‌ బెయిల్‌పై ఉన్నారని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. రెగ్యులర్‌ బెయిల్‌కు చట్టపరమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది

WhatsApp Join Now
Youtube Subscribe