ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉదయం 11:20 గంటలకు శాసనసభలో 2026–2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బడ్జెట్ పత్రాలను ముందుగా సమర్పించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మంత్రివర్గం ముందుకు బడ్జెట్ నోట్లను ఉంచి వివరణ అందించారు.
సమావేశంలో, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచి రూపొందించిన బడ్జెట్ పత్రాలపై చర్చ జరిగింది. రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవంగా బడ్జెట్ను ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి, సామాజిక సంక్షేమం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, వ్యవసాయ, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత కేటాయించబడనుంది.
ప్రజల కోసం నూతన కార్యక్రమాలు, రివెన్యూ ప్రణాళికలు మరియు అవసరమైన నిధుల కేటాయింపులను బడ్జెట్ పత్రం లో పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఆర్థిక వ్యూహంతో ముందడుగు వేసేందుకు సిద్ధంగా ఉంది.
