దావోస్‌లో నకిలీ వీఐపీ పాస్‌ల మోసం

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సును లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు చెలరేగారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొనే కీలక వేదికను ఆసరాగా చేసుకుని, ఆయనతో భేటీ పేరుతో బిలియనీర్లకు నకిలీ వీఐపీ పాస్‌లు విక్రయించారు. ‘యూఎస్‌ఏ హౌస్‌’ ప్రవేశం కల్పిస్తామంటూ మోసం చేసినట్లు వెల్లడైంది. ఇలాంటి నకిలీ పాస్‌లు కొనుగోలు చేయవద్దని నిర్వాహకులు హెచ్చరిస్తూ, ఈ ఏడాది ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయని తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe